Sunday, September 29, 2019

తెలంగాణ మంత్రుల కోసం ఇళ్లకే వెళ్లాలి

September 29 2019:  ఇంతవరకు ఉన్నట్లుగా తెలంగాణ మంత్రులు అంతా ఒకే చోట అందుబాటులో ఉండని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించడం కోసం సెక్రటేరియట్ ను ఖాళీ చేయించారు. బూర్గుల రామకృష్ణారావు బవన్ లో అందరికి వసతి లేనందున మంత్రులను ఆయా చోట్ల కేటాయించారు. ఉదాహరణకు హోం మంత్రి ఎపి ఖాళీ చేసిన డిజిపి ఆఫీస్ లో కూర్చుంటారు. దేవాదాయ శాఖ మంత్రి బొగ్గుల కుంటలోని ఎండోమెంట్స్ ఆఫీస్ లో ఉంటారు. ఇలా ఆయా చోట్ల మంత్రులకే చాంబర్ లు ఇచ్చారు. అదే సమయంలో మత్రులు తమ బంగళాలలో కూడా ప్రజలకుఅందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించింది.

No comments:

Post a Comment